hyderabadupdates.com Gallery వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి

వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి

వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఓ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ కు మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం, విస్తృతంగా సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ కావ‌డం, ఓ ఛాన‌ల్ ఏకంగా త‌న గురించి ప్ర‌త్యేక క‌థ‌నాన్ని టెలికాస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నంగా మారారు మంత్రి. దేశ వ్యాప్తంగా ఆయ‌న వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. దీంతో గ‌త్యంత‌రం లేక మీడియా ముందుకు వ‌చ్చారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. త‌ను తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న‌కు స‌ద‌రు లేడీ ఆఫీస‌ర్ కు మ‌ధ్య ఎలాంటి లింక్ లేద‌ని పేర్కొన్నారు. అదంతా దేవుడే చూసుకుంటాడ‌ని , త‌న‌కు అంత సీన్ లేద‌న్నారు . త‌న‌కు ఉన్న ఒక్క‌గానొక్క కొడుకును కోల్పోయి బాధ‌లో ఉన్నాన‌ని, త‌న కొడుకు పేరు మీద ఫౌండేష‌న్ పెట్టి సేవ‌లు చేస్తున్నాన‌ని చెప్పారు .
నన్ను ఏమైనా అనండి, నాపై ఏదైనా రాయండి కానీ మహిళా అధికారిపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాసి ఇబ్బంది పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుంద‌ని, ఆ ప‌వ‌ర్స్ త‌న‌కు ఉండ‌వ‌ని చెప్పారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరని, త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు .దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి ప‌ద‌విని సైతం త్యాగం చేసిన చ‌రిత్ర త‌న‌ద‌న్నారు. అద్దె ఇంట్లో ఉండి ప్ర‌జ‌ల‌కు సేవ చేశాన‌ని అన్నారు. నా కొడుకును కోల్పోయిన‌ప్పుడే తాను స‌గం చ‌ని పోయాన‌ని, ద‌య‌చేసి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని కోరారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
The post వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు

సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్

శ్రీ‌లంక : భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యావ‌త్ ప్ర‌పంచం ఈనెల 15న ఆదివారం శ్రీ‌లంక‌లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ దాయాదుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సంద‌ర్బంగా

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణతిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు