hyderabadupdates.com Gallery విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ post thumbnail image

న్యూఢిల్లీ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు ఇటీవ‌లే ఒక్క‌ట‌య్యారు. స్వంతంగా గృహ ప్ర‌వేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌తంగా ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. త‌మ పెళ్లికి, రిసెప్ష‌న్ కు రావాలంటూ కోరారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసినందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు మోదీ. బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల‌ను అభినందిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ చేస్తూ లేఖ పంపించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పీఎంఓ స్ప‌ష్టం చేసింది.
విజయ్ దేవరకొండ కుటుంబానికి అధికారిక ప్రశంసా లేఖను పంపింది. ఈ సంజ్ఞ నటుడి బృందం, కుటుంబ సభ్యులను ఆనంద పరిచింది. దేవరకొండ నివాసానికి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా లేఖ కాపీని కూడా పంపింది. ఈ లేఖ ఇవాళ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని కుటుంబం ఉంటున్న‌ ఇంటికి చేరింది. అరుదైన గుర్తింపుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నటుడి పీఆర్ బృందం ఆన్‌లైన్‌లో నవీకరణను పంచుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందుకోవడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించ బడుతుంది, ఫిబ్రవరి 26న జరిగిన ఈ ప్రముఖ జంట వివాహం మరింత చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ చేసినందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు విజయ్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా.
The post విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సీక్వెల్ చిత్రం బోర్డ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది భారీ అంచ‌నాల మ‌ధ్య‌. ఎవ‌రూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్

వీలైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాలివీలైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించాలి

మేడారం : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని ఆదేశించారు. పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నిక‌లు చేప‌ట్టాలంటూ సీఎం అధ్యక్ష‌త‌న జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో గడువు

Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?Harinarayan Singh: పదిసార్లు ఎమ్మెల్యేగా హరినారాయణ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేనా?

Harinarayan Singh : అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రత్యేకమే. మన దేశంలో ఇలా 10 కంటే ఎక్కువ సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. బిహార్‌లోనూ అలాంటి సీనియర్‌ మోస్ట్‌ నేతలు ఉన్నప్పటికీ… ఇంతవరకూ ఎవరూ