hyderabadupdates.com Gallery వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి post thumbnail image

హైద‌రాబాద్ : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి, సునీల్ , స‌త్య‌, వెన్నెల కిషోర్ , గెట‌ప్ శ్రీ‌ను, ముర‌ళీధ‌ర్ గౌడ్, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. కథా ప‌రంగా చూస్తే సంతోషంగా పెళ్లైన వ్యక్తి వివాహేతర సంబంధంలో చిక్కుకుని, దాని పర్యవసానాలను ఎదుర్కోవడం చుట్టూ తిరుగుతుంది. రవితేజ కొన్ని నవ్వులు పూయించడంలో, రొమాంటిక్ సన్నివేశాలలో పర్వాలేదని అనిపించాడు. పూర్తిగా వినోదాన్ని పండించాడు. ఇదిలా ఉండ‌గా ర‌వితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి వరుస నిరాశలతో ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న నటుడు రవితేజకు ఈ సినిమా కొంచెం ప‌ర్వాలేద‌ని అనిపించాడు.
ఒక ర‌కంగా ఈ సినిమా ర‌వితేజ‌కు ఆక్సిజ‌న్ ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండ‌టంతో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు ర‌వితేజ ఫ్యాన్స్. జోకులు, స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల భర్త, భార్య, మరో మహిళ అనే మూస ఫార్ములాను ఎంచుకున్నా వినోదాన్ని పండించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. ఇదిలా ఉండ‌గా తన జీవితంలోని ఇద్దరు మహిళలను సమర్థించుకునే కథానాయకుడి ఆలోచన తెలుగు సినిమాలో పదే పదే చూపిస్తూ వ‌చ్చారు. జ‌నం కూడా వాటిని ఆద‌రిస్తున్నారు. దీంతో ఈ కాన్సెప్ట్ తోనే ప‌లు సినిమాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. వెండి తెర‌పై న‌వ్వులు పూయించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.
The post వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలిజీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

    బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.