hyderabadupdates.com movies విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ తరహా వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరు ఒకటంటే మరొకరు నాలుగంటారు. కానీ దీనికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మాత్రం తన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెబుతూ విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక వీక్ పత్రిక ముఖ చిత్ర కథనంలో మెరిసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సదరు పత్రిక నారా లోకేష్ పనితీరును పూసగుచ్చినట్టు వివరించింది. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపింది. తద్వారా నారా లోకేష్ మంత్రిగా ఏం చేశారు? ఏం సాధించారు? అన్న ప్రశ్నలకు పరోక్షంగా ఇది సమాధానంగా మారింది. ఇక పెట్టుబడుల విషయాన్ని కూడా ప్రధానంగా ఈ పత్రిక హైలైట్ చేసింది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ఈ క్రమంలో గత ఏడాది చేసిన పలు పర్యటనలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించింది. ఎవరు ఎవరు నారా లోకేష్‌ను కలుసుకున్నారు? ఎంతెంత పెట్టుబడులకు సంబంధించి ఆయన కృషి చేశారు? ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ రాక వంటి అంశాలను ప్రధానంగా ఈ పత్రిక ప్రస్తావించింది. తద్వారా నారా లోకేష్ విదేశాలకు వెళ్లి ఏం తెచ్చారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు పస లేకుండా పోయింది. ఆధారాలు, విషయాలతో సహా పత్రిక తేటతెల్లం చేయడం గమనార్హం.

మొత్తంగా ఇప్పుడే కాదు గతంలోనూ నారా లోకేష్‌పై వచ్చిన, వస్తున్న విమర్శలకు ఆయన పనితీరే సరైన సమాధానమని తాజా కథనం స్పష్టం చేస్తోంది. నోటి నోరు అన్నట్టుగా కాకుండా మంత్రి లోకేష్ తన పని తీరుతోనే సమాధానం చెబుతుండటం మరింత విశేషం. ఏదేమైనా మంత్రి వ్యవహార శైలిపై ఇక నుంచి విమర్శలు చేయాలని భావించే వారు, కామెంట్లు చేయాలని అనుకునే వారు కూడా ఒకసారి ఆలోచించుకునేలా నారా లోకేష్ పనితీరు ఉండటం గమనార్హం.

Related Post

తెలంగాణ‌లో `సికింద్రాబాద్‌` సెగ‌… అస‌లేంటిది?తెలంగాణ‌లో `సికింద్రాబాద్‌` సెగ‌… అస‌లేంటిది?

తెలంగాణ‌లో తాజాగా `సికింద్రాబాద్` కేంద్రంగా వివాదం తెర‌మీద‌కి వచ్చింది. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ఉన్న మండ‌లాల ప‌రిధిల‌ను కూడా మార్చనున్నారు. అయితే.. దీనికి కొంత క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన జంట న‌గ‌రాల్లో

మొంథా తుఫాన్… ఏపీకి ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?మొంథా తుఫాన్… ఏపీకి ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?

అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన మొంథా.. తీవ్ర తుఫాను మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 11 -12 గంట‌ల 30 నిమిషాల మ‌ధ్య మ‌చిలీప‌ట్నం-క‌ళింగ ప‌ట్నం మ‌ధ్య కాకినాడ‌కు దక్షిణంగా న‌ర‌సాపురం ప‌రిధిలో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు

Ghantasala The Great Musical Night Celebrates a Timeless LegendGhantasala The Great Musical Night Celebrates a Timeless Legend

The enduring legacy of legendary playback singer Ghantasala was celebrated with grandeur at the “Ghantasala The Great Special Musical Night,” a star-studded event that brought together music lovers and film