hyderabadupdates.com Gallery వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌ post thumbnail image

తిరుమల : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈవో వద్ద భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
తదుపరి అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, ప్రత్యేకంగా శ్రీ‌వారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు. తాగునీరు, ఆహార పరీక్షా ప్రయోగశాలను సందర్శించిన ఈవో, వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏవిధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయటి క్యూ లైన్లను పరిశీలించారు. ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత వి. జయప్రకాశ్ తో వర్చువల్‌గా మాట్లాడారు. పీఏసీ-5ను సందర్శించిన ఈవో, లాకర్లు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి, భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా వినియోగించు కునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
The post వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంLabour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

    కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌ (స్మృతి)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు

CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌

CP Sajjanar : వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) ప్రశ్నించారు. వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన

56 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్56 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుల‌లో టాప్ లో ఉన్నాడు సుకుమార్. త‌నకు 56 ఏళ్లు పూర్త‌య్యాయి. త‌ను ఇప్పుడు స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ తో త‌న త‌దుప‌రి సినిమా స్క్రీనింగ్ ప‌నుల్లో