hyderabadupdates.com Gallery శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం post thumbnail image

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్నారు సీఎం. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టాల‌ని సూచించారు.
ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం లోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయన్నారు. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్‌లను త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు.
The post శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు

లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టాకీ పార్ట్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం