hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ

సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ

సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ post thumbnail image

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్ర‌స్తుతం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. మ‌రో వైపు టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న ఆస్ట్రేలియాను పసికూన‌లు అని భావించిన జింబాబ్వే ఓడించింది. టోర్నీలో ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. ప్ర‌ధానంగా స్టార్ హిట్ట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఉన్న‌ట్టుండి అనారోగ్యానికి గుర‌య్యాడు. మ‌రో వైపు ఇషాన్ కిష‌న్ దంచి కొడుతున్నాడు. మ‌రో వైపు ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు సంజూ శాంస‌న్.
ఈ త‌రుణంలో సౌర‌వ్ గంగూలీ స్పందించాడు. త‌ను శ‌నివారం మీడియాతో మాట్లాడాడు. సంజు సామ్సన్ అద్భుత‌మైన ఆట‌గాడు. ఇప్ప‌టికే గ‌తంలో మూడు సెంచ‌రీలు చేశాడు పొట్టి ఫార్మాట్ లో. స్థిరమైన అవకాశాలకు అర్హుడని పేర్కొన్నాడు. ప‌దే ప‌దే ఛాన్స్ లు ఇచ్చి ఆ త‌ర్వాత తీసి వేస్తే ఏ ఆటగాడూ స్థిర‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించ లేడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు సౌర‌వ్ గంగూలీ. త‌ను ఫామ్ లోకి రావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నాడు. గ‌త ఏడాది లో దుమ్ము రేపాడు. సంజూ శాంస‌న్ కు అపార‌మైన శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు. ఇదిలా ఉండ‌గా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 22 ర‌న్స్ చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఒక ఫోర్ ఉంది.
The post సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడుCM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

    బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటుAP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

  విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్‌

APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టంAPEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం

  మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యుత్‌ పునరుద్ధరణ చర్యల పురోగతిని ఆయన వివరించారు. అన్ని సెక్షన్ కార్యాలయాలకు జనరేటర్లు,