hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు

సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు post thumbnail image

కోల్ క‌తా : భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంలో ముఖ్య భూమిక పోషించాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. విండీస్ చేతిలోకి దాదాపు వెళ్లిన మ్యాచ్ ను భార‌త్ ముంగిట్లోకి తీసుకు వ‌చ్చాడు. త‌ను కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఆడాడు. ఇందులో 12 ఫోర్లు 4 భారీ సిక్సులు ఉన్నాయి. మొత్తం 97 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. జ‌ట్టు గెలుపు సాధించేంత వ‌ర‌కు నిద్ర పోలేదు త‌ను. గ‌త కొంత కాలంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. తొట్రుపాటుకు గురి కాకుండా సంయ‌మ‌నంతో ఆడాడు. ఇండియాను సెమీ ఫైన‌ల్ కు చేర్చాడు శాంస‌న్.
ఈ సంద‌ర్బంగా గంగూలీ స్పందించాడు. సంజు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను ఏమిటో, త‌న‌లో ఉన్న స‌త్తా ఏపాటిదో ఈ మ్యాచ్ ద్వారా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాడ‌ని కితాబు ఇచ్చాడు గంగూలీ. ఇదిలా ఉండ‌గా గత ఆరు నెలలుగా జట్టులో చోటు దక్కించుకునేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ అయినా లేదా మరెవరైనా వచ్చినా జట్టులో చోటు దక్కించు కోలేక పోయాడు. ప్రపంచ కప్‌కు ముందు, సంజు మళ్లీ విఫలమయ్యాడని, అతను జట్టులో చోటు దక్కించు కోలేడని, భారత్‌లో ఇంత ప్రతిభ ఉందని, శుభ్‌మాన్ గిల్ ఎందుకు లేడని ప్ర‌శ్న‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి. కానీ క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అనూహ్యంగా వ‌చ్చాడు. స‌త్తా చాటాడు. ఇండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపు అందించాడ‌ని పేర్కొన్నాడు దాదా.
The post సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాంరాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం

అమ‌రావ‌తి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా

చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమరావతి : నేతన్నలకు రాష్ట్ర స‌ర్కార్ తీపి కబురు చెప్పంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్ర‌క‌టించారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు