hyderabadupdates.com Gallery స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం

స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం

స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 140 ఎక‌రాల‌కు పైగా ఉన్న చెరువు ప‌రిధిలో చాలా వ‌ర‌కు నివాసాలు వ‌చ్చేశాయ‌న్నారు. ఇప్పుడు వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకా 90 ఎక‌రాల‌కు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. న‌గ‌రంలో పెద్ద చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. అందులో స‌రూర్‌న‌గ‌ర్ చెరువు కూడా ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలోనే హైడ్రా క‌మిష‌న‌ర్ స‌రూర్‌న‌గ‌ర్ చెరువును క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వానికి నివేదించి.. మార్చిలోగా ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. ఏడాదిలో ప‌నులు పూర్తి చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు.
చెరువుల‌ అభివృద్ధి అంటే పై మెరుగులు దిద్ద‌డం కాద‌ని ఇప్ప‌టికే హైడ్రా పున‌రుద్ధ‌రించిన బ‌తుక‌మ్మ‌కుంట‌, బ‌మృకున్ – ఉద్ -దౌలా, కూక‌ట్‌ప‌ల్లి నల్ల‌చెరువుల‌ను ప‌రిశీలిస్తే అంద‌రికీ అర్థ‌మౌతుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ఆ దిశ‌గానే స‌రూర్‌న‌గ‌ర్ చెరువును తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు. చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడిక‌ను తొల‌గించి లోతు పెంచుతామ‌న్నారు. పూడికను తొల‌గించ‌డం ద్వారా నీటి నిలువ సామ‌ర్థ్యం పెంచ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌న్నారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు స‌రిగా ఉండేలా చూస్తాం అన్నారు. మ‌రీ ముఖ్యంగా వ‌ర‌ద‌ల నియంత్ర‌ణ‌కు ఈ చెరువు ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. మురుగు నీరు చెరువులో క‌ల‌వ‌కుండా వాటర్ బోర్డు సహకారంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే.. ఎస్‌టీపీల సామ‌ర్థ్యాన్నిపెంచుతామ‌న్నారు.
The post స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పున‌రుద్ధ‌రిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్

హైద‌రాబాద్ : తెలుగు సినిమాలు పరిమాణానికి, ఆత్మకు మధ్య సమతుల్యతను పాటిస్తాయని అన్నారు ప్ర‌ముఖ న‌టి మాధురీ దీక్షిత్.ఈ గౌరవానికి గాను ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా దిగ్గజాలు, ఐకాన్‌ల మధ్య ఇక్కడ ఉండటం

గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడుగ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడు

అమ‌రావ‌తి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌నగవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర