hyderabadupdates.com Gallery సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా

సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా

సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా post thumbnail image

హైద‌రాబాద్ : ఆప్ ఎంపీ రాఘవ్‌చద్దా అనే ఈ యువ పార్లమెంటేరియన్ ఎన్నడూ సామాన్యుల జీవితాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదు. అలాగే మధ్య తరగతి జీవితాల్ని ఉద్దరించే ప్రశ్నలూ లేవనెత్త లేదు. ఎగువ మధ్య తరగతి, ధనవంతుల గురించే ఎక్కవ మాట్లాడాడు. విమాన చార్జీల గురించి, విమానాశ్రయాల్లో సదుపాయాల గురించి మాట్లాడిన ఎంపీ రైళ్ల గురించి ఒక్కమాటైనా మాట్లాడాడా? జనరల్ బోగీల కుదింపు మాట్లాడాడా? ఎత్తేసిన రైల్వేస్టేషన్లు, రద్దైన రైళ్ల గురించి, రైలు టిక్కెట్ల గురించి మాట్లాడాడా? ప్రజల కనీస అవసరాల గురించి గాక సెల్‌ఫోన్లో వాడే డేటా గురించి మాట్లాడాడు.
పరీక్ష ఫెయిలవడం కన్నా రాత్రి క్రికెట్లో ఆర్సీబీ ఓడిపోవడం ఎక్కువ బాధపడే స్టూడెంట్లు, ఉద్యోగం రాకపోయినా ఫలానా రాజకీయపార్టీ నాయకుడి మీద ఈగ వాలడం సహించని మగరాయుళ్ళూ, నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను గాక సీరియల్లో హీరోయిన్‌కు వచ్చే ఇబ్బందులు తల్చుకుని బాధపడే మహిళలున్న సమాజంలో రాఘవ్‌చద్దా ఒక ఉద్దరాక రాజకీయ నాయకుడిగా కనిపించడంలో తప్పేమీ కాదు. పైగా మనకి ఎర్రగా, బుర్రగా, స్టైల్‌గా, రిచ్‌గా, సినిమా హీరోలా వుంటే చాలు, వాడేం చేసినా నచ్చేయడం మన బలహీనత.
అయినా, ఎన్నడో అమ్ముడు పోయిన మీడియా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోజూ పార్లమెంటులో అత్యవసరమైన అన్ని విషయాల మీద మాట్లాడే ప్రధాన‌ ప్రతిపక్ష నాయకుడిని గానీ, ఇతర పార్టీల నేతలని గానీ గాకుండా ఒక మామూలు ఎంపీని ఆకాశానికెత్తి ప్రచారం చేస్తున్నప్పుడైనా కనీస అనుమానం మనకు రావాలి. ఇతడు స్పాన్సర్డ్ నాయకుడని. తెలివిగా ప్రజల అవసరాల్ని, అజెండాని హైజాక్ చేస్తున్నాడని. (సుభాష్ చంద్ర‌బోస్ )
The post సామాన్యుల గురించి మాట్లాడ‌ని రాఘ‌వ్ చ‌ద్దా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌న నాయ‌గ‌న్ మూవీ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్జ‌న నాయ‌గ‌న్ మూవీ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్

చెన్నై : త‌మిళ‌నాడు పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ నటుడు విజ‌య్ న‌టించిన మూవీ జ‌న నాయ‌గ‌న్. ఈ చిత్రం అనివార్య కార‌ణాల వ‌ల్ల విడుద‌ల కాలేదు. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌లు జరుగుతున్నాయి.

YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన 

రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మంగళవారం పర్యటించారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా

బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలిబీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి

హైద‌రాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్