hyderabadupdates.com Gallery సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సికింద్రాబాద్ పై. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ చ‌రిత్ర‌ను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రో వైపు ఈ న‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంతా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలో సికింద్రాబాద్ లోనే అతి పెద్ద జ‌నాభా క‌లిగిన మ‌ల్కాజిగిరి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీగా ఉన్నారు ఈట‌ల రాజేంద‌ర్. శ‌నివారం ఆయ‌న సికింద్రాబాద్ పై జ‌రుగుతున్న వివాదంపై స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ రెండూ అద్భుత‌మైన న‌గ‌రాల‌ని, ఈ రెండింటికి ఘ‌న‌మైన వార‌స‌త్వం, చ‌రిత్ర ఉంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఇంకొక‌రు చెరిపి వేయాల‌ని చూస్తే వారిని జ‌నం క్షమించ‌ర‌ని అన్నారు.
సికింద్రాబాద్ పేరును ఎవరు తక్కువ చేయకూడదు అలా అని మల్లజిగిరిని కూడా తక్కువ చేయవద్దని సూచించారు ఈట‌ల రాజేంద‌ర్. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట‌ర్లంతా మ‌ల్కాజ్ గిరి జిల్లాకు చెందిన వారేన‌ని చెప్పారు. సికింద్రాబాద్ చరిత్ర, గ్లామర్, గొప్పదనానికి తాను వ్యతిరేకం కాదని అన్నారు. కానీ మల్కాజిగిరి పేరు మార్చమనడం సరికాదని స్ప‌ష్టం చేశారు. మార్చాలి అనే వారు అనాడు అధికారంలో ఉన్నారని, అప్పుడు ఎందుకు సికింద్రాబాద్ ను జిల్లాగా ప్ర‌క‌టించ లేక పోయారో ఒక‌సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.
The post సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌భావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ప్ర‌భావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్

అమ‌రావ‌తి : ఏపీలో చోటు చేసుకున్న బ‌ర్డ్ ఫ్లూ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ