hyderabadupdates.com Gallery సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శాసనసభకు రాని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జీతం తీసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎలాగని ప్రశ్నించారు. సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఆరోపణలను కొట్టిపారేవారు. ద‌మ్ముంటే బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్, త‌న్నీరు హ‌రీష్ రావులు త‌మ వ‌ద్ద‌ ఆధారాలుంటే సీబీసీఐడీకి ఇవ్వాలని సవాల్ విసిరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
“గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదన్నట్లు” విపక్షాల తీరు ఉందని ఎద్దేవా చేశారు. పేదల కోసం పనిచేసే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇప్పటి వరకు 1 కోటి పది లక్షలు జీతం తీసుకుని కనీసం అసెంబ్లీకి కూడా రాని మాజీ సీఎం చంద్రశేఖర రావును రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లో పడుకున్నఆయన ప్రజల సొమ్మును తిన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.
రోజూ 18 గంటలు పనిచేస్తూ రాష్ట్ర మంతటా తిరుగుతూ ప్రజలకోసం పనిచేస్తూ.. లక్షలాది దళిత గిరిజన ఆదివాసిలకు ఇండ్లిచ్చి వారి ఇండ్లలో వెలుగు, కళ్ళల్లో ఆనందం నింపుతున్న మంత్రి పొంగులేటి రాజీనామా చేయమనడానికి సిగ్గుండాలి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
The post సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

    మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర

ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ

హైద‌రాబాద్ : ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశపు ఈవీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోంద‌ని అన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 544 ఈవీలతో మొదలైన ఈవీల సంఖ్య, నేడు 2.5 లక్షలకు

కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీకొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్‌స్ట్రక్షన్స్ కొండ‌ల‌ను త‌వ్వుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తులు లేకుండా త‌వ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. రేవంత్