hyderabadupdates.com Gallery సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ post thumbnail image

హైద‌రాబాద్ : మిర్యాల‌గూడ వేదిక‌గా జ‌ర‌గిన బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గ‌రువారం కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌మాజం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష‌ను చూసి సిగ్గు ప‌డుతోంద‌న్నారు. అయినా సోయి లేకుండా ఇష్టానుసారంగా ఎలా ప‌డితే అలా మాట్లాడ‌టం దారుణ‌మన్నారు. త‌ను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. మెద‌డులో చిప్ దొబ్బిన‌ట్టు ఉందంటూ అనుమానం వ్య‌క్తం చేశారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు, పథకాలు వినిపించవని కేవ‌లం వ‌చ్చేది మాత్రం మురికి భాష త‌ప్ప మ‌రోటి రాద‌న్నారు.
హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఐదు రోఉలు కాదు 500 రోజుల పాటు కోర్సులు చేసినా రేవంత్ రెడ్డి వ్య‌క్తిత్వం మార‌ద‌న్నారు. బూతు భాష త‌ప్పా త‌న‌కు ఏదీ రాద‌న్నారు. ఎన్ని కోర్సులు చ‌దివితే ఏం లాభం. సంస్కారం అనేది లేక పోతే అని మండిప‌డ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి, ఉద్యమాల్ని నడిపి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్ ను ఉద్దేశించి వ్య‌క్తిగ‌తంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు కేటీఆర్. ప్ర‌జ‌లు నిన్ను క్ష‌మించ‌ర‌ని, రాబోయే రోజుల్లో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు. అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగితే రేపొద్దున ప‌వ‌ర్ పోయే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.
The post సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల

OSRTC Bus: మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధం !OSRTC Bus: మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధం !

    పార్వతీపురం-మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సులో… పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని మంటల చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్