hyderabadupdates.com Gallery హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన దానికంటే అద్బుతంగా ఆడింది. ప్రేక్ష‌కుల మన‌సు దోచుకుంది. గుండెల‌ను హ‌త్తుకునేలా ఉండ‌డంతో జ‌నం ఆద‌రించారు. ఇది తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన నిజ‌మైన క‌థ‌. ఈ సినిమా పాట‌లు కూడా బిగ్ హిట్ గా నిలిచాయి. సినిమా స‌క్సెస్ కు అస్సెట్ గా మారాయి.
తాజాగా వేణు ఉడుగుల సంచ‌ల‌నంగా మారాడు. త‌ను కొత్త‌గా హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వెళ‌తున్న‌ట్లు తెలిపాడు. ఇవాళ ఆయ‌న మీడియాతో త‌న కొత్త ప్రాజెక్టు గురించి పంచుకున్నాడు. ఇక హ‌రింద‌ర్ ఎస్ సిక్కా ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత‌. త‌ను రాసిన కాలింగ్ సెహ‌మ‌త్ సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది. ఇందులో అందాల తార ఆలియా భ‌ట్ న‌టించింది. మేఘనా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.
ఈ చి్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత వేణు ఉడుగుల‌తో క‌లిసి కొత్త ప్రాజెక్టుకు ప‌ని చేయ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండ‌గా వేణు ఉడుగుల మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. సిక్కా ఇచ్చిన కథతో నా హిందీ దర్శకత్వ రంగ ప్రవేశం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇది నిజంగా నాకు ఒక కలల ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
The post హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Droupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతిDroupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్‌ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె… దాదాపు

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

    ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీPM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

Narendra Modi : ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర శాంతి ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. గాజా నుంచి 20 మంది ఇజ్రాయెల్ బందీలు తిరిగి విడుదల కావడాన్ని