hyderabadupdates.com Gallery హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం post thumbnail image

అమెరికా : ప్ర‌వాస భార‌తీయుల‌కు కోలుకోలేని షాక్ నిర్ణ‌యం తీసుకుంది అమెరికా స‌ర్కార్. హెచ్ -1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించ‌చే బిల్లును యుఎస్ శాస‌న స‌భ్యుడు ఇవాళ ప్ర‌వేశ పెట్టారు స‌భ‌లో. ఫ్లోరిడాకు చెంద‌ని రిప‌బ్లిక‌న్ ప్ర‌తినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లోయేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్స్ యాక్ట్ లేదా ఎక్సైల్ యాక్ట్’ను ప్రవేశ పెట్టారు. వీసా కార్యక్రమాన్ని ముగించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ జాతీయత చట్టాన్ని సవరించే బిల్లు ఇది. కార్పొరేషన్లు పదే పదే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికాలోకి చౌకైన విదేశీ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయని చెబుతూ హెచ్ 1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించేందుకు బిల్లును ప్ర‌వేశ పెట్టారు.
అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం మన విలువలు , జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని స్టీబ్ పేర్కొన్నారు. త‌మ శ్రామిక శక్తిని పణంగా పెట్టి కార్పొరేషన్లు , విదేశీ పోటీదారులకు అవార్డులు ఇచ్చే హెచ్ 1బి వీసా కార్యక్రమం ద్వారా త‌మ దేశానికి చెందిన కార్మికులు, నిపుణుల‌కు ఉపాధి లేకుండా పోతుంద‌ని ఆవేద‌న చెందారు. అమెరికా నుండి పని చేస్తున్న అమెరికన్లను మళ్లీ మొదటి స్థానంలో ఉంచడానికి ప్రవాస చట్టాన్ని ప్రవేశ పెడుతున్న‌ట్లు చెప్పారు. కాగా అమెరికాలో నివ‌సించేందుకు, ప‌ని చేసేందుకు పెద్ద సంఖ్య‌లో భార‌తీయ నిపుణులు ఈ వీసాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ట్రంప్ వ‌చ్చాక చ‌ట్ట విరుద్ద‌మైన వ‌ల‌స‌పై ఉక్కుపాదం మోపింది.
The post హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

లాహోర్ : ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భార‌త్, శ్రీ‌లంక దేశాలు. ఈ సంద‌ర్బంగా భార‌త్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదున్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హిళా ఐఏఎస్ ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛాన‌ల్ తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ల్స్ ల‌లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం