hyderabadupdates.com Gallery హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం post thumbnail image

అమెరికా : ప్ర‌వాస భార‌తీయుల‌కు కోలుకోలేని షాక్ నిర్ణ‌యం తీసుకుంది అమెరికా స‌ర్కార్. హెచ్ -1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించ‌చే బిల్లును యుఎస్ శాస‌న స‌భ్యుడు ఇవాళ ప్ర‌వేశ పెట్టారు స‌భ‌లో. ఫ్లోరిడాకు చెంద‌ని రిప‌బ్లిక‌న్ ప్ర‌తినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లోయేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్స్ యాక్ట్ లేదా ఎక్సైల్ యాక్ట్’ను ప్రవేశ పెట్టారు. వీసా కార్యక్రమాన్ని ముగించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ జాతీయత చట్టాన్ని సవరించే బిల్లు ఇది. కార్పొరేషన్లు పదే పదే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికాలోకి చౌకైన విదేశీ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయని చెబుతూ హెచ్ 1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించేందుకు బిల్లును ప్ర‌వేశ పెట్టారు.
అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం మన విలువలు , జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని స్టీబ్ పేర్కొన్నారు. త‌మ శ్రామిక శక్తిని పణంగా పెట్టి కార్పొరేషన్లు , విదేశీ పోటీదారులకు అవార్డులు ఇచ్చే హెచ్ 1బి వీసా కార్యక్రమం ద్వారా త‌మ దేశానికి చెందిన కార్మికులు, నిపుణుల‌కు ఉపాధి లేకుండా పోతుంద‌ని ఆవేద‌న చెందారు. అమెరికా నుండి పని చేస్తున్న అమెరికన్లను మళ్లీ మొదటి స్థానంలో ఉంచడానికి ప్రవాస చట్టాన్ని ప్రవేశ పెడుతున్న‌ట్లు చెప్పారు. కాగా అమెరికాలో నివ‌సించేందుకు, ప‌ని చేసేందుకు పెద్ద సంఖ్య‌లో భార‌తీయ నిపుణులు ఈ వీసాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ట్రంప్ వ‌చ్చాక చ‌ట్ట విరుద్ద‌మైన వ‌ల‌స‌పై ఉక్కుపాదం మోపింది.
The post హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలిభారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి

అమ‌రావ‌తి : భార‌త దేశం ఔన్న‌త్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువల‌ను ప్ర‌త్యేకంగా విద్యార్థుల‌కు తెలియ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ , ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కొణిద‌ల‌. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోమ‌వారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు

ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళిప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళి

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌ట్టిలో మొల‌కెత్తిన గొంతుక‌, ప్ర‌జా స్వ‌ర‌పేటిక గుమ్మ‌డి విఠ‌ల్ రావు అలియాస్ గ‌ద్ద‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు. కానీ త‌ను పాడిన పాట‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఉంటాయి. మ‌న‌ల్ని గాయ‌ప‌రుస్తూనే ఉంటాయి. చ‌ని

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దుఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు

ముంబై : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఇంత కాలం కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింద‌ని ఆరోపించారు. ముంబైలో మాజీ సీఎం మీడియాతో