hyderabadupdates.com movies హైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగింది

హైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగింది

vహ్యాకింగ్ మోసాలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యక్తుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషియల్ మీడియా ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు కీలక సమాచారాన్ని తస్కరించడం తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

తాజాగా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ ను కొందరు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించే సరికి కీలక తీర్పుల ఫైళ్లు ధ్వంసం అయినట్టు సమాచారం. శనివారం వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఆన్ లైన్ బెట్టింగు సైట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు మరొకసారి వెబ్ సైట్ ఆన్ చేసి శుక్రవారం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ బెట్టింగు సైట్ల తో పాటు ఇతర అసభ్యకర సైట్లు కూడా కనిపించాయి.

దీంతో సమాచారాన్ని అత్యంత రహస్యంగా సైబర్ పోలీసులకు చేరవేశారు. వారు రంగంలోకి దిగి సైట్ ను ఓపెన్ చేసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇతర దేశాలకు చెందిన ముఠాలు ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి చెందిన సైట్లను హ్యాక్ చేస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర మంత్రుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా స్తంభింప చేస్తున్నారు. ఈ పరిణామాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు దృష్టి పెట్టినా సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. నేరస్తులు కాంబోడియా వంటి దేశాల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Related Post

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కొయిరాలా కలిసి…30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కొయిరాలా కలిసి…

బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షుకులను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు మణిరత్నం. పేరుకు అది సౌత్ మూవీనే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో