hyderabadupdates.com Gallery 10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు

10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు

10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు post thumbnail image

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 30 నుండి ఈ ఏడాది జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించిన వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు విశేష సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఆయ‌న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిల‌తో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో మీడియాత మాట్లాడారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం క‌ల్పించామ‌న్నారు చైర్మ‌న్. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు.
ఇదిలా ఉండ‌గా ఈ పది రోజుల్లో స్వామి వారిని 7.83 లక్షల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని చెప్పారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో 6.83 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకోగా ఈ ఏడాది ల‌క్ష మంది భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శించుకున్నార‌ని చెప్పారు. జనవరి 2వ తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఇక‌ 3వ తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శన భాగ్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. అందు బాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడం జ‌రిగింద‌ని చెప్పారు. త‌మ ప్ర‌యారిటీ కేవ‌లం సామాన్యుల‌కేన‌ని పేర్కొన్నారు.
The post 10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షాAmit Shah: సామ్రాట్‌ ‘బిగ్‌ మ్యాన్‌’ అవుతారు – అమిత్‌ షా

Amit Shah : బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీకి సంబంధించి కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సామ్రాట్‌ను మోదీ ‘బిగ్‌ మ్యాన్‌’ చేస్తారని అన్నారు. సామ్రాట్‌ పోటీ చేస్తున్న

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలుCabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్,

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న