hyderabadupdates.com Gallery 100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్

100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్ post thumbnail image

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ కార్పొరేట్ల‌కు వంతం పాడుతూ కీల‌క‌మైన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కానికి తూట్లు పొడి చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ యాత్ర గురువారం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం వేల్పూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులంతా హాజరయ్యారు. కరువు పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. మోదీ పాలనలో ఏనాడు కూడా 100 రోజుల పాటు పని ఇవ్వలేదని వాపోయారు. తమ గ్రామంలో 20 రోజులు పని ఇచ్చిందే ఎక్కువని, చేసిన పనికి సైతం వేతనాలు గడువు ప్రకారం చెల్లించలేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిల‌తో కూలీలు. కరువు పనిపైనే బ్రతికే వారి కార్డులు చెప్పాపెట్టకుండా తొలగించారని గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికులు లక్ష్మమ్మ, పుల్లారెడ్డి, దేవయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ తెచ్చిన కొత్త పథకం VB G- RAM G చట్టం వద్దని రచ్చబండ వేదికగా గ్రామస్థులంతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అమలు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన ఉపాధి హామీ ప‌థ‌కం వ‌ల్ల గ్రామసభలోనే పనుల నిర్ణయం జరిగేదన్నారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే పని ఇచ్చే వార‌ని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి గ్యారంటీ ఇవ్వబడిందన్నారు. కూలీలకు వేతనం 14 రోజుల లోపు అని నిర్ణయించార‌ని తెలిపారు. ఆడ – మగ అనే తేడాలేకుండా సమాన కూలి చెల్లించడం జరిగిందన్నారు. యంత్రాల వాడ‌కాన్ని నిషేధం విధించార‌ని తెలిపారు ష‌ర్మిల‌. కూలీల వేత‌నాలు వంద శాతం కేంద్ర‌మే ఇచ్చేద‌న్నారు. మ‌రో వైపు మోదీ తీసుకు వ‌చ్చిన వీబిజీ రామ్ జీ చ‌ట్టంలో పైవాటికి పూర్తిగా తూట్లు పొడిచారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ష‌ర్మిలా రెడ్డి.
The post 100 రోజుల ప‌ని క‌ల్పించని కేంద్ర స‌ర్కార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీఅతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అమరావతి : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు

భ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వంభ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వం

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు

ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలుఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన