hyderabadupdates.com Gallery 20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి

20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి

20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి post thumbnail image

ఢిల్లీ : టీవీకే పార్టీ చీఫ్‌, తమిళ సినీ రంగంలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే విజ‌య్ న‌టించిన జ‌య నాయ‌గ‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా చిత్రానికి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే స‌మ‌యంలో ధ‌ర్మాస‌నం కీల‌క సూచ‌న చేసింది. జనవరి 20వ తేదీలోగా ఈ కేసును పరిష్కరించాలని మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సినిమా ధృవీకరణ ప్రక్రియను నిలిపి వేసింది మ‌ద్రాస్ హైకోర్టు. ఈ సంద‌ర్బంగా జ‌న నాయ‌గ‌న్ త‌ర‌పున లాయ‌ర్ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించాలని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎ.జి. మసిహ్ లతో కూడిన ధర్మాసనం దీనిపై విచార‌ణ చేప‌ట్టింది గురువారం.
విచార‌ణ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ పిటిష‌న్ పై తాము జోక్యం చేసుకోమ‌ని, అయితే జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల తేదీకి సంబంధించి త‌క్ష‌ణ‌మే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ పిటిషన్‌ను చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి దాఖలు చేసింది. చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి ఇచ్చిన మునుపటి ఆదేశంపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వును నిర్మాత సవాలు చేశారు. ఇదిలా ఉండ‌గా జన నాయగన్ జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు . ఇప్ప‌టికే మూవీ రిలీజ్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల ఆగి పోయింది.
The post 20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానంశివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులుPrashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Prashant Kishor : బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌కు (Prashant Kishor) ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో

Tribal Woman: గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!Tribal Woman: గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!

    ఎకరం భూమిని తోటి గ్రామస్థులకు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు ఓ గిరిజన మహిళ. ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ(ఎస్‌) పంచాయతీలో కోలాం గిరిజనులకు 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ నిర్మించుకోవడానికి స్థలం కరవైంది.