ఏపీలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న సంకల్పంతో తాజాగా ప్రత్యేకంగా అసెంబ్లీని కొలువు దీర్చింది. సుమారు 7 గంటలపాటు సాగిన సభలో ఏకైక అజెండాగా అమరావతికి చట్టబద్దతను సభ్యులు చర్చించారు. అనంతరం.. దీనిని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించారు.