hyderabadupdates.com Gallery 22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్

22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్

22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్ post thumbnail image

అమరావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం అందించడం జ‌రుగుతుంద‌న్నారు . 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వ విద్యాలయం కోసం రూ.39.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించడం జ‌రిగింద‌న్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద‌ రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర ఉచిత‌ విద్యుత్ సరఫరా అందించ బ‌డుతోంద‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగింద‌న్నారు అచ్చెన్నాయుడు. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింద‌న్నారు. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722.00 కోట్ల రూపాయలు ప్రతిపాదించామ‌ని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, వ్యవసాయ, అనుబంధ పనుల కోసం 2,783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల పని దినాలు కల్పించిన‌ట్లు చెప్పారు అచ్చెన్నాయుడు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి, వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) కింద వ్యవసాయం, అనుబంధ పనుల కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్ర‌తిపాదించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి.
The post 22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అరుంధ‌తి రాయ్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారంఅరుంధ‌తి రాయ్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారం

అమెరికా : భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ ర‌చయిత్రి అరుంధ‌తి రాయ్ కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. యూఎస్ బుక్ క్రిటిక్ అవార్డుల విజేతలలో త‌ను నిల‌వ‌డం విశేషం. నోబెల్ బహుమతి గ్రహీత హాన్ కాంగ్ రాసిన ఒక నవల, ఆర్టిఫిషియల్

PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శPM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

    దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని

జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానంజ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి