అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం అందించడం జరుగుతుందన్నారు . 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వ విద్యాలయం కోసం రూ.39.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అందించ బడుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగిందన్నారు అచ్చెన్నాయుడు. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722.00 కోట్ల రూపాయలు ప్రతిపాదించామని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, వ్యవసాయ, అనుబంధ పనుల కోసం 2,783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల పని దినాలు కల్పించినట్లు చెప్పారు అచ్చెన్నాయుడు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి, వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) కింద వ్యవసాయం, అనుబంధ పనుల కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి.
The post 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్
Categories: