hyderabadupdates.com movies 70 ఏళ్ల వయసులో వైరల్ వ్లాగ్: 3 రోజుల్లో 3 కోట్లు

70 ఏళ్ల వయసులో వైరల్ వ్లాగ్: 3 రోజుల్లో 3 కోట్లు

సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70 ఏళ్ల వయసులో సరదాగా చేసిన మొదటి వ్లాగ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన కేవలం 72 గంటల్లోనే ఈ వీడియోకు దాదాపు 3 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఎటువంటి అనుభవం లేకపోయినా, ఆయన చూపించిన నిజాయితీ నెటిజన్ల మనసు గెలుచుకుంది.

రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండకుండా సమయాన్ని సరదాగా గడపడానికి వినోద్ కుమార్ వ్లాగింగ్ మొదలుపెట్టారు. తన మొదటి వీడియోలో “నా పేరు వినోద్ కుమార్ శర్మ, నాకు వ్లాగ్స్ చేయడం రాదు.. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను” అంటూ చాలా వినమ్రంగా పరిచయం చేసుకున్నారు. మీ అందరికీ నా వీడియో నచ్చితే, అదే ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేస్తానని ఆయన కోరారు. ఆయనలోని అమాయకత్వం, స్వచ్ఛమైన మాటలు చూసి జనం ఫిదా అయిపోయారు.

ఈ వీడియోకు వ్యూస్ మాత్రమే కాదు, ఏకంగా 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. “వయసు అనేది కేవలం అంకె మాత్రమే అంకుల్.. మేము మీకు సపోర్ట్ చేస్తాం” అంటూ వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విమర్శలు చప్పట్లుగా మారే వరకు నేను ఆగను అని ఆయన చెప్పిన మాటలు యువతకు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. మొదటి వీడియోతోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ 64 వేల మార్కును దాటేసింది.

కేవలం సామాన్యులే కాదు, అనుపమ్ ఖేర్, జై భానుశాలి వంటి సెలబ్రిటీలు కూడా ఈ ‘సూపర్ గ్రాండ్ పా’ వీడియోను చూసి మురిసిపోయారు. “మీ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ వీడియో చాలా బాగుంది” అని జై భానుశాలి కామెంట్ చేశారు. హై క్వాలిటీ కెమెరాలు, గ్రాఫిక్స్ ఉన్న వీడియోల కంటే మనసు నుంచి వచ్చే నిజాయితీ ఉన్న కంటెంట్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుందని ఈ వ్లాగ్ నిరూపించింది.

View this post on Instagram

Related Post

ఐపీఎల్ వేలం ఇక చాలు.. ఆ పద్ధతి మార్చండిఐపీఎల్ వేలం ఇక చాలు.. ఆ పద్ధతి మార్చండి

ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ మొదలయ్యే ముందు మ్యాచ్‌ల కంటే ఎక్కువగా మారుమోగేది ‘వేలం పాట’. ఏ ప్లేయర్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు? ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసింది? అనే ఉత్కంఠ కోట్లాది మంది ఫ్యాన్స్‌లో ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే

‘కేసీఆర్ అధికారం’పై సీఎం రేవంత్ సంచలన శపథం‘కేసీఆర్ అధికారం’పై సీఎం రేవంత్ సంచలన శపథం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న శ‌ప‌థం చేశారు. బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ మ‌రోసారి అధికారం ద‌క్క‌నివ్వ‌న‌ని.. ఇది త‌న శ‌ప‌థ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వ‌హించిన కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులైన సర్పంచ్‌ల సన్మాన