hyderabadupdates.com Gallery 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ ఏర్పాటు చేయాలి..? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టాళ్ల‌ను ఎక్క‌డ పెట్టాలి అనే అంశాల‌ను ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చించారు. ఎంత‌మంది వ‌స్తారు.. వారికి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశాల‌ను స‌మీక్షించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీల‌క సూచ‌న‌లు చేశారు క‌మిష‌న‌ర్.
ఒక‌ప్పుడు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు ప‌రిస‌రాల‌కు రావాలంటే వెనుక‌డుగు వేసేవార‌ని.. ఇప్పుడు చెరువు చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు బండి ర‌మేష్ అన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 16 ఎక‌రాలుగా మిగిలి పోతుంద‌నుకున్న చెరువును 30 ఎక‌రాల‌కు విస్త‌రించి సుంద‌రంగా తీర్చి దిద్ద‌డంప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ని శాలువ‌తో స‌న్మానించారు. న‌ల్ల చెరువు ప్రారంభోత్స‌వంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ అపూర్వ్ చౌహాన్ , కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, హైడ్రా డీసీపీ శ్రీ‌కాంత్ , ఏడీసీపీ సుద‌ర్శ‌న్ తో పాటు.. ప‌లువురు అధికారులు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును సంద‌ర్శించిన వారిలో ఉన్నారు.
The post 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్

Bhojpuri Singers : బిహార్‌ సంస్కృతి, సంప్రదాయాలకు భోజ్‌పురీ పాటలు (Bhojpuri Singers) పెట్టింది పేరు. అక్కడి ప్రజల్లోనూ వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ‘జానపదం’ తనదైన ముద్ర వేసుకుంటోంది. అనేక మంది పాపులర్‌ గాయనీ

Chandrababu Naidu Meets PM Modi, Invites Him for Key Andhra Pradesh EventsChandrababu Naidu Meets PM Modi, Invites Him for Key Andhra Pradesh Events

New Delhi: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu met Prime Minister Narendra Modi on Monday to personally invite him as the chief guest for two major upcoming events in

వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై