hyderabadupdates.com movies 9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, కస్టోడియల్ హింసపై కఠిన సందేశం ఇచ్చింది. అదేవిధంగా మృతుల కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

జూన్ 19, 2020న కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెనిక్స్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాతాంకుళం పోలీస్ స్టేషన్‌లో వారిపై తీవ్రంగా హింసించినట్లు దర్యాప్తులో తేలింది. నిరంతరంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, బలమైన దెబ్బల వల్ల ఏర్పడిన అంతర్గత గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా వారు మృతి చెందినట్లు వెల్లడైంది.

ఈ కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులు దోషులుగా తేలగా, కోర్టు వారికి మరణశిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించి, పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. తాజా తీర్పు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related Post

దురంధర్ వల్ల నష్టమంటే నమ్మగలరాదురంధర్ వల్ల నష్టమంటే నమ్మగలరా

ఒకే భాషలో విడుదలై ప్యాన్ ఇండియా ట్యాగ్ లేకుండా 1100 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్న దురంధర్ వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందంటే నమ్మడం కష్టం కానీ ఇది నిజం. మిడిల్ ఈస్ట్ మార్కెట్ కిందకు వచ్చే

రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  మ‌రో రెండురోజుల్లోనే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను