hyderabadupdates.com movies రిజర్వేషన్ సంగతేంటి? తేల్చని రేవంత్!

రిజర్వేషన్ సంగతేంటి? తేల్చని రేవంత్!

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదం కూడా అయిన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి పెండింగులోనే పడింది. ఇది అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియ నుంచి అనేక రాజకీయాలకు వరకు రిజర్వేషన్ విషయం తీవ్రమైన ఉత్కంఠ రేపింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు.. ప్రభుత్వం పోరాడినా.. తిరిగి ఇది పెండింగులోనే ఉంది.

ఈ క్ర‌మంలో తాజాగా గురువారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటార‌ని అందరు అనుకున్నారు. ముఖ్యంగా మంత్రులు కూడా దీనిపై చూచాయగా లీకులు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుదీర్ఘంగా మంత్రి వర్గ సమావేశం జరిగింది. కానీ, ఈ సమావేశంలో ఎక్కడా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్ విషయం ప్రస్తావనకు రాలేదు.

అంటే, దీనిని బట్టి.. కోర్టు తీర్పులు వచ్చే వరకు ఇక, రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇటీవ‌ల ప‌లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలా, తెలంగాణ కేబినెట్ కూడా తాజా నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరు పిల్లలు ఉంటే.. ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తీసేసింది. ఇకపై ఎంత మంది పిల్లలు ఉన్నా.. పోటీ చేయొచ్చు.

దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయనున్నారు. దీనిని మంత్రి వర్గం తీర్మానించింది. అదేసమయంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను మరింత విస్తరించడంతోపాటు.. వేగంగా పనులు పూర్తవుతుందా చూడాలని తీర్మానం చేసింది. సంక్షేమ పథకాలపై డిసెంబర్ 31 నుంచి చేపట్టనున్న ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూసే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని ఈ సందర్భంలో కేబినెట్‌లో చర్చించారు.

Related Post

పొలిటికల్ చిచ్చు రాజేసిన ఈటల మాటలుపొలిటికల్ చిచ్చు రాజేసిన ఈటల మాటలు

బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ త‌ర‌ఫున ప‌నిచేయాలో ప్ర‌జ‌లే తేల్చుకుంటార‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం విష‌యాన్ని బీజేపీ హైక‌మాండ్ చూసుకుంటుందన్నారు. త‌న‌పై వ‌స్తున్న

డైరెక్టర్‌కు ఇల్లు కొనిస్తానన్న నిర్మాతడైరెక్టర్‌కు ఇల్లు కొనిస్తానన్న నిర్మాత

‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ముందు నటుడిగా పరిచయం అయిన అతడిలో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ చిత్రానికి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు రాహుల్. రెండో

తమన్ మీద ఒత్తిడి పెరుగుతోందితమన్ మీద ఒత్తిడి పెరుగుతోంది

టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ పేరు ముందు వరసలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజికి తనిచ్చిన అవుట్ ఫుట్ కి అభిమానులు ఫుల్ హ్యాపీ. పాటలు కొంచెం హడావిడిగా అనిపించినా బీజీఎమ్ రూపంలో పూర్తిగా సంతృప్తి పరిచాడు.