hyderabadupdates.com movies ‘గంభీర్ నిర్ణయాలు అస్సలు బాలేవు’

‘గంభీర్ నిర్ణయాలు అస్సలు బాలేవు’

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు కొన్ని గొప్ప విజయాలు ఉన్నా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ ఓటమితో పలు విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల ముగిసిన ఈ వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓటమి పాలవ్వడంపై, 1983 ప్రపంచకప్ విన్నర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించారు. గంభీర్ తీసుకునే నిర్ణయాలు చాలా తొందరపాటుతో కూడినవని,  కోచింగ్‌లో జట్టు ఫలితాలు చాలా దారుణంగా ఉంటున్నాయని శ్రీకాంత్ విమర్శించారు.

“గంభీర్ కోచింగ్‌లో ఇండియా ఫలితాలు రెండు ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్నాయి. అవి చాలా అద్భుతంగా అయినా ఉంటున్నాయి, లేదంటే చాలా దారుణంగా అయినా ఉంటున్నాయి” అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సూటిగా చెప్పారు. అనవసరంగా మార్పులు చేస్తుండడం వల్లనే ఈ పరిస్థితి వస్తోందని, నిలకడైన కాంబినేషన్‌ను కొనసాగించడం ముఖ్యమని శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌లో జరిగిన సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ ఉండటం వల్లే భారత్ బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సిరీస్ ఓటమితో 2025లో వన్డేల్లో భారత్ తొలి రెండు ఓటములను చవిచూసింది. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ సారథ్యంలో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచింది. కానీ ఈ ఓటమి ఆయన కోచింగ్ విధానంపై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేయడంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోగలిగింది. 

వారి ప్రదర్శనపై రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు చేసి తన పవర్‌ను చూపించగా, కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి టాలెంట్‌తో కూడిన రిస్క్ టేకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. వీరిద్దరూ అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 236 పరుగుల టార్గెట్‌ను సులువుగా ఛేజ్ చేశారు. శ్రీకాంత్ విమర్శలు ఒకవైపు ఉన్నా, కోహ్లీ, రోహిత్ ఫామ్ లోకి రావడం గంభీర్‌కు ఊరటనిచ్చింది. సీనియర్ల స్థానంపై సందేహాలు ఉన్నప్పటికీ, జట్టులో అనవసర నిర్ణయాలు తీసుకోకుండా, సరైన బ్యాలెన్స్‌ను కొనసాగించాల్సిన బాధ్యత కోచ్‌పై ఉందని మాజీల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Post

Rajinikanth to resume Jailer 2 schedule from January 20 shoot? Here’s what we knowRajinikanth to resume Jailer 2 schedule from January 20 shoot? Here’s what we know

Superstar Rajinikanth is currently involved in the work for his next release, Jailer 2, directed by Nelson Dilipkumar. As fans eagerly await official updates from the makers, it appears that the

షోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవుషోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవు

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర చివరి సినిమా ఇక్కీస్ నిన్న విడుదలయ్యింది. గత నెలరోజులుగా దురంధర్ ఫీవర్ లో మునిగి తేలుతున్న హిందీ ప్రేక్షకులకు కాస్త తెరిపినిచ్చేలా