hyderabadupdates.com movies ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

ఆ ఇద్ద‌రినీ అలా సంతృప్తి ప‌రిచిన రేవంత్ రెడ్డి

మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారి విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు.. రేవంత్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో వారికి అవ‌కాశం చిక్క‌లేదు. నిజానికి 18 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంది. కానీ.. పూర్తిస్థాయిలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌ లేదు. తాజాగా చేసిన విస్త‌ర‌ణ‌లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు.

దీంతో మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా హామీపొందారన్న చ‌ర్చ ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల‌కు.. కూడా అవ‌కాశం చిక్క‌లేదు. దీంతో తాజాగా వారిలో ఒక‌రికి కార్పొరేష‌న్ ప‌ద‌విని.. మ‌రొక‌రికి కొత్త‌గా స‌ల‌హారు పోస్టును క్రియేట్ చేసి.. మంత్రుల‌కు ఉండే అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించారు. అదేవిధంగా భ‌ద్ర‌త నుంచి కాన్వాయ్ వ‌ర‌కు కూడా సౌక‌ర్యాలు క‌ల్పించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఎవ‌రు వారు?

1) మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్‌రావు. ఈయ‌న‌ను రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా నియ‌మించారు. ఇది త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. మంత్రుల‌కు క‌ల్పించేకేబినెట్ హోదాతో పాటు.. కాన్వాయ్‌, భ‌ద్ర‌త‌ను కూడా క‌ల్పిస్తారు. అదేవిధంగా వేత‌నాల‌ను కూడా మంత్రుల‌కు ఇచ్చే వేత‌నాల‌నే ఇస్తారు.

2) పి. సుద‌ర్శ‌న్ రెడ్డి: ఈయ‌న బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేశారు. ఈయ‌న కూడా పార్టీ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. మంత్రి వ‌ర్గంలో సీటు కోసం ప్ర‌య‌త్నించారు. తాజాగా అయినా.. ద‌క్కుతుంద‌ని కొన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. అయితే.. సీటు ద‌క్క‌లేదు. దీంతో స‌ర్కారుకు స‌ల‌హాదారుగా నియ‌మించారు. మంత్రుల‌కు వ‌ర్తించే అన్ని సౌక‌ర్యాల‌తో పాటు కాన్వాయ్‌, భ‌ద్ర‌త ల‌భిస్తుంది. అంతేకాదు.. మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

Related Post

రష్మిక బ్రాండ్ ఒకటే సరిపోలేదారష్మిక బ్రాండ్ ఒకటే సరిపోలేదా

వచ్చే వారం వస్తున్న కొత్త సినిమాల్లో కాస్త నోటబుల్ అని చెప్పుకోదగిన వాటిలో ముఖ్యమైంది ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ఈ వెరైటీ లవ్ థ్రిల్లర్ కు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునతో మన్మథుడు

రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్

​గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని ఏకంగా 16 మంది మంత్రులు ఒకే రోజు రాజీనామా చేశారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ భారీ

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చినా ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తారు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సైతం ఇదే పని చేసింది.