hyderabadupdates.com Gallery Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ post thumbnail image

 
 
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు. కాగా, ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఈ కుంకీ ఏనుగుల కేంద్రం ఏర్పాటు చేశారు. నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన సంగతి తెలిసిందే. అటవీ ఏనుగులు జనావాసాలు, పంటపొలాల్లో పడి నాశనం చేయకుండా ఈ కుంకీ ఏనుగులు అడ్డుకుంటాయి. దీని కోసమే ప్రత్యేకంగా వాటిని ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు.
 
ఈ కార్యక్రమం అనంతరం అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఉపముఖ్యమంత్రి పవన్‌‌. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచారు అటవీ శాఖ అధికారులు. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరీంగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైడ్ లైఫ్ అని అర్థం. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అటవీ శాఖకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో హనుమాన్‌పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని హుకుం జారీ చేశారు.
 
జనసేన పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు !
 
జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. శనివారం సాయంత్రం ఈ ఎక్స్ ఖాతా హ్యాక్‌ చేసినట్లు పార్టీ కార్యాలయంలోని సిబ్బంది గుర్తించారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వ్యవహారంలో.. నాయకులను పార్టీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఈ అకౌంట్‌లో అనుమానాస్పద పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.
 
ఈ ఖాతా హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌తోపాటు కవర్ ఫొటోను సైబర్ నేరగాళ్లు తొలగించారు. అలాగే పార్టీకి సంబంధం లేని ఫొటోలు సైతం ఈ ఖాతాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే గతంలో ఈ పార్టీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుల మాత్రం యాథావిథిగా ఉన్నాయి. కానీ దీనిపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయ లేదు.
మరోవైపు జనసేన పార్టీ ఎక్స్ ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ చానెల్ హ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీ యూట్యూబ్ చానెల్ హ్యాకింగ్‌కు గురైంది. ఆ తర్వాత జనసేన యూట్యూబ్ ఛానెల్‌ను యథాస్థితికి తీసుకొచ్చారు.
The post Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీTejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం – తేజస్వీ యాదవ్‌ హామీ

Tejashwi Yadav : బిహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అధికారం కోసం ప్రజలపై రాజకీయ పార్టీల నేతలు, అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మరో అడుగు ముందుకు వేసి…

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకాBomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

    2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో

Droupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందంDroupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందం

      భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము… దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాతో భారత్‌ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యరంగం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాల(ఎంఓయూలు)పై సంతకాలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి