hyderabadupdates.com movies ఉస్తాద్ మీద ఇంత పెద్ద స్టేట్ మెంటా

ఉస్తాద్ మీద ఇంత పెద్ద స్టేట్ మెంటా

ఏపీలో కూటమి పాలన వచ్చాక పవన్ కళ్యాణ్ పెండింగ్ పడిపోయి అభిమానులకు తక్కువ నమ్మకం ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. తేరికి రీమేక్ అనే ప్రచారం కాస్త నెగటివ్ బజ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా దర్శకుడు హరీష్ శంకర్ ముందు రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ ని పక్కనపెట్టి దాని స్థానంలో ఉస్తాద్ ని తేవడం అభిమానుల్లో అనుమానాలు పెంచింది. అయితే ఒకటి రెండు పోలికలు అనిపించినప్పటికీ ఇది పూర్తిగా కొత్త స్టోరీ అని, కంపారిజన్ చేయడానికి ఛాన్స్ లేనట్టుగా డైరెక్టర్ తో పాటు ఆ టీమ్ లో ఉన్న దశరథ్ లాంటి సీనియర్లు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు విషయానికి వద్దాం.

నిన్న జరిగిన ఆంధ్రకింగ్ తాలూకా ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ ఓజిని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో అనౌన్స్ మెంట్ స్టేజి నుంచి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ మోసిన మూవీ ఓజినే. దీనికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బులెట్ లాగా దూసుకుపోయింది. అంచనాలకు తగ్గట్టే బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఉస్తాద్ దానికి మించి అని చెప్పడం చాలా పెద్ద స్టేట్ మెంట్. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ ఎక్కడలేని అంచనాలు పెంచేసుకుంటారు. ఇదే అసలు రిస్క్.

మరి అంతగా హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాడనేది వేచి చూడాలి. వచ్చే నెల మొదటి ఆడియో సింగల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందని రవిశంకర్ చెప్పారు. అయితే మైత్రినే నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెద్ది మార్చి 27 రానుంది. అబ్బాయికి బాబాయికి కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉంటుందా అనేది అసలు ప్రశ్న. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏదీ మాట మీద ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆలోగా ఏమేం మార్పులు, షాకులు జరుగుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Related Post

జాతీయ అవార్డులపై నటుడి తీవ్ర వ్యాఖ్యలుజాతీయ అవార్డులపై నటుడి తీవ్ర వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు పేరెత్తితే చాలు.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేస్తారు. సోషల్ మీడియాలోనే కాక.. అనేక విషయాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా జాతీయ అవార్డుల విషయంలో ఆయన

క‌విత అరెస్టు చేసిన పోలీసులు, అసలేం జరిగింది?క‌విత అరెస్టు చేసిన పోలీసులు, అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌విత‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు.. ఉన్న ప‌లువురు మ‌ద్ద‌తు దారులు, జాగృతి సంస్థ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో హైద‌రాబాద్‌లో కొంత ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. అయితే..