hyderabadupdates.com movies ప్రభాస్ పంచ్.. మారుతి ఛాలెంజ్.. హైప్ పెంచుతాయా?

ప్రభాస్ పంచ్.. మారుతి ఛాలెంజ్.. హైప్ పెంచుతాయా?

ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ మొదలైనపుడు.. అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసిందే. మారుతి ఈ సినిమాకు ముందు మిడ్ రేంజ్ సినిమాలే తీశాడు. పైగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. చివరి చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులొచ్చాయి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అభిమానులు ఈ సినిమా వద్దే వద్దూ అంటూ ప్రభాస్‌కు విన్నపాలు చేశారు.

వారిలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే.. సినిమా గురించి అధికారిక ప్రకటన చేయడానికి కూడా మేకర్స్ భయపడ్డారు. కానీ ఈ సినిమా ప్రోమోలు చూశాక వారి అభిప్రాయం మారుతూ వచ్చింది. ఫస్ట్ టీజర్ లాంచ్ అయినపుడు మంచి బజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత చిత్రంగా మళ్లీ మైప్ తగ్గడం మొదలైంది. చాలా ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదు. పాటలు కూడా బానే ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో లేవు. ప్రమోషన్లు కూడా సరిగా చేయలేదు. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య వస్తున్న ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోగలదా అన్న సందేహాలు కలిగాయి.

ఐతే నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి, ఇతర టీం సభ్యుల మాటలు చూస్తే సినిమా ఆషామాషీగా ఉండదు అనే అభిప్రాయం అభిమానుల్లో కలుగుతోంది. ముఖ్యంగా మారుతి చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. ఒక్క శాతం కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గదని.. సినిమాలో అసలు డిజప్పాయింట్ చేసే సన్నివేశమే ఉండదని.. అలా ఉంటే తన ఇంటికి వచ్చి నిలదీయొచ్చని ఇంటి అడ్రస్ డీటైల్స్ కూడా స్టేజ్ మీద చెప్పేశాడు మారుతి.

సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి స్టేట్మెంట్ ఒక దర్శకుడి నుంచి రాదు. పైగా ఇదేమీ చిన్న సినిమా కాదు.. ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ ఇవ్వడానికి. అయినా మారుతి ఇలా మాట్లాడాడంటే తనకు సినిమా మీద అంత నమ్మకం ఉన్నట్లే. మరోవైపు తన సినిమాల గురించి గొప్పలు పోని ప్రభాస్ సైతం మారుతికి మంచి ఎలివేషన్ ఇచ్చాడు.

ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ.. అది పెన్నుతో రాశావా, గన్నుతో రాశావా అని మారుతిని అడిగాడు. దీంతో పతాక సన్నివేశాలు ఒక రేంజిలో ఉంటాయని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. మిగతా టీం సభ్యులు కూడా సినిమా వేరే లెవెల్లో ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కాన్ఫిడెన్స్ చూశాక ప్రభాస్ అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి వాటిని అందుకునేలా సినిమా ఉంటుందా అన్నది ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది.

Related Post

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో

Katy Perry and Justin Trudeau Kiss and Cuddle on Luxurious Yacht After Orlando Bloom SplitKaty Perry and Justin Trudeau Kiss and Cuddle on Luxurious Yacht After Orlando Bloom Split

Pop sensation Katy Perry and former Canadian Prime Minister Justin Trudeau have officially confirmed months of romance rumors with a public display of affection off the coast of Santa Barbara,