hyderabadupdates.com Gallery రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్

రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్

రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్ post thumbnail image

కేర‌ళ : కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ కు బిగ్ షాక్ త‌గిలింది. రేప్ చేసిన కేసులో త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు త‌ర‌లించారు. గ‌త‌ డిసెంబర్ 2024లో పాలక్కాడ్ ఉప ఎన్నికలో రాహుల్ సాధించిన అద్భుత విజయం తర్వాత ఈ రేప్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయినా వాటిని లెక్క చేయ‌లేదు. చివ‌ర‌కు అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి సాన్నిహిత్యం పెంచుకోవడం, బిడ్డ కావాలనే నెపంతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత మహిళ గర్భవతి అయినప్పుడు బెదిరింపులతో సంబంధాన్ని తెంచుకోవడం చేశాడ‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే రాహుల్ కు 37 ఏళ్లు. త‌న‌ను త‌దుప‌రి విచార‌ణ కోసం ప‌త‌నం తిట్ట జిల్లాకు విచార‌ణ నిమిత్తం త‌ర‌లించారు.
అతన్ని పతనంతిట్టలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు . ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్యేపై వ‌రుస‌గా న‌మోదైన కేసు ఇది మూడోది. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన ఒక మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం, గతంలో కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన మమ్కూటతిల్, ఒక వివాహిత మహిళను హోటల్‌కు పిలిచి అత్యాచారం చేశాడని, అలాగే ఆమెపై బలవంతంగా గర్భస్రావం చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతర కేసులలో అతన్ని అరెస్ట్ చేయకుండా కోర్టు గతంలో పోలీసులను నిరోధించినప్పటికీ, తాజా ఫిర్యాదులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
The post రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారువిద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానంశివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి