hyderabadupdates.com Gallery సంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీ

సంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీ

సంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీ post thumbnail image

హైద‌రాబాద్ : మ‌రోసారి క‌లిసి సినిమా చేయ‌నున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్ర‌సాద్. ఆయ‌న తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ తో క‌లిసి రాజా సాబ్ తీశారు. అది సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైంది. ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. కానీ వ‌సూళ్లు కూడా నెమ్మ‌దిగా వస్తున్నాయ‌ని, త‌న సినిమా ప‌ట్ల న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి. చాలా మంది కావాల‌ని త‌న‌ను, త‌మ సినిమాను టార్గెట్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ త‌రుణంలో పీపుల్స్ మీడియా అధినేత షాకింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌డం కూడా మ‌రింత ఆస‌క్తిని క‌లిగించేలా చేసింది టాలీవుడ్ లో.
బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా టీజీ విశ్వ ప్ర‌సాద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పవన్ కళ్యాణ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయనుందని స్ప‌ష్ట చేశారు. దీనిని ప్ర‌క‌టించినందుకు తాము ఆనంద ప‌డుతున్నామ‌న్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కింద రాబోయే చిత్రంలో నటించడంతో పాటు నిర్మించనున్నారని తెలిపారు. భోగి పండుగ శుభ సందర్భంగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వ ప్రసాద్‌తో కలిసి ఓజీ నటుడి చిత్రాన్ని రెండు నిర్మాణ సంస్థలకు సంబంధించిన బృందాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో వారి భవిష్యత్ సహకారాలపై తదుపరి చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.
The post సంక్రాంతి వేళ ప‌వ‌ర్ స్టార్ తో మరో మూవీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తAP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణటిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితర‌ణ

తిరుప‌తి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా

Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు 

    కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి