hyderabadupdates.com movies మరో దావోస్ గా హైదరాబాద్?

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది.

ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ లో సదస్సు సరిపోదని, మధ్యలో ఒకసారి…దాదాపు 6 నెలల తర్వాత మరో సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.

దావోస్ లో వార్షిక, హైదరాబాద్ లో అర్ధ-వార్షిక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తలు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా, మరో దావోస్ గా హైదరాబాద్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 & ఏఐ హబ్ ఆవిష్కరణ వంటి అంశాలపై చర్చించారు.

Related Post

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లుఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. చిన్న‌నాటి నుంచే విద్యార్థుల్లో రాజ‌కీయ అంశాల‌పై అవగాహ‌న క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఎమ్మెల్యేలు, మంత్రుల‌లో ఒత్తిడి