hyderabadupdates.com Gallery ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు post thumbnail image

రాయ‌చూర్ జిల్లా : క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒక‌రు మృతి చెందారు. ప‌లువురిపై కేసు న‌మోదు చేశారు. ఇదే స‌మ‌యంలో రాయ‌చూర్ జిల్లా ఎస్పీ విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత‌డిపై వేటు వేసింది. ఈ త‌రుణంలో తాజాగా శ‌నివారం మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఇంటికి నిప్పంటించారు. దీంతో ప్ర‌మాద ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుటుంబీకులు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెంగళూరులో ఉన్నారు గాలి జనార్ధన్ రెడ్డి. ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి కి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండ‌గా జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు. కాగా ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం పై సర్వత్రా చర్చ జ‌రుగుతోంది.
The post ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాంస‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేర‌ని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన

Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?

  బీహార్‌ లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్‌ బంధన్‌