hyderabadupdates.com Gallery మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. బాలికలకు సాధికారత కల్పించి, రక్షించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం దేశ వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బాలికలకు సాధికారత కల్పించే లక్ష్యానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
ప్రజలు తమను తాము పున‌రంకితం చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం అని ముఖ్యమంత్రి అన్నారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం నిజమైన పురోగతిని సాధిస్తుందని ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం ముందుకు సాగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వామ్యం వహించేలా వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు. త‌మ స‌ర్కార్ ఏపీలో కొలువు తీరిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని రీతిలో బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల సంక్షేమం , సాధికార‌త దిశ‌గా అడుగులు వేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గజాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

న్యూఢిల్లీ : స‌న్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్ర‌భావం అన్ని రంగాల‌లో ఉంటుంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించ‌డం మంచిద‌ని సూచించారు. దేశ రాజ‌ధాని వేధిక‌గా జ‌రిగిన ఏఐ వ‌ర‌ల్డ్

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

      పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాంఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

అమరావతి : ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన