hyderabadupdates.com Gallery గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా అమ‌రావ‌తిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ పై కీల‌క సూచ‌న‌లు చేశారు. ఉన్న‌త స్తాయి స‌మీక్ష స‌మావేశంలో సీఎం ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లకు శ్రీ‌కారం చుట్టాల‌న్నారు. వ‌చ్చే ఏడాదిలో నిర్వ‌హించే ఈ గోదావ‌రి పుష్క‌రాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఉండాల‌న్నారు.
గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేస్తున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పి నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవ‌ల టీటీడీ ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వ‌హించార‌ని, వాటిని కూడా ప‌రిశీలించాల‌ని సూచించారు. ఇటీవ‌ల గ‌త ఏడాది దేశంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. అలాంటి పొర‌పాట్లు రాకుండా గోదావ‌రి పుష్క‌రాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు సీఎం.
The post గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.

అన్నమయ్య సంకీర్తనలు పులకించిన స‌ప్త‌గిరులుఅన్నమయ్య సంకీర్తనలు పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రంల‌లో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. నారాయణగిరి ఉద్యాన వనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఊంజల్ సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టి గానంతో

ఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీఖ‌ర్గే సార‌థ్యంలో సీఎం, మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు శ్రమించాల‌ని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత‌, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,