hyderabadupdates.com Gallery బార‌త్ లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌లేం

బార‌త్ లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌లేం

బార‌త్ లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌లేం post thumbnail image

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల నుంచి ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల భార‌త్, బంగ్లాదేశ్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్బంగా బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనడం లేదని ప్ర‌కటించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం భ‌ద్ర‌తా కార‌ణాలు లోపించ‌డం వ‌ల్ల‌నేన‌ని పేర్కొన్నారు. భారత్ పర్యటన తమ ఆటగాళ్లకు, జర్నలిస్టులకు ఏమాత్రం క్షేమకరం కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింద‌న్నారు. దీంతో త‌మ బోర్డు కీల‌క స‌మావేశం నిర్వ‌హించిందని, ఆ మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా క్రికెట్ బోర్డు మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు.
అయితే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరినప్పటికీ వారు అంగీకరించ లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో భద్రతా దృష్ట్యా భారత్‌లో ఆడటం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు . ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారతదేశంలోనే ఆడతారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కుండ బ‌ద్ద‌లు కొట్టింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్, ప్రస్తుతం భారతదేశంలో ఆడటం తమకు సురక్షితం కాదని పేర్కొంటూ, శ్రీలంకలో ఆడాలని కోరారు. జరిగిన అన్ని భద్రతా అంచనాలను, స్వతంత్ర సమీక్షలతో సహా, పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పారు.
The post బార‌త్ లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌లేం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గేఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా

Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

  దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని