hyderabadupdates.com Gallery లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు post thumbnail image

అమ‌రావ‌తి : నారా లోకేష్ యువ గ‌ళం చేప‌ట్టి స‌రిగ్గా మూడేళ్లు పూర్త‌య్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. ఒక ర‌కంగా తెలుగుదేశం ప‌వ‌ర్ లోకి రావ‌డానికి నారా లోకేష్ చేసిన యువ గ‌ళం కీల‌క పాత్ర పోషించింది. ఆయ‌న‌పై ప‌లు కేసులు బ‌నాయించింది ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇదే క్ర‌మంలో త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడును స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం పేరుతో వేధింపుల‌కు గురి చేయ‌డం, ఆ త‌ర్వాత అరెస్ట్ చేసి నిర్బంధించ‌డం కూడా ఎదుర్కొన్నారు నారా లోకేష్. అన్నింటిని త‌ట్టుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.
ఇవాళ రాష్ట్రంలో ఐటీ, విద్యా శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నాడు . స‌మ‌ర్త‌వంతంగా పాల‌నలో భాగం పంచుకుంటూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నాడు. ప్ర‌త్యేకించి ఐటీ ప‌రంగా , ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో త‌న తండ్రి చంద్ర‌బాబుతో పోటీ ప‌డుతున్నాడు. ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్లాడు. ఆపై భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేలా ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌ఫలీకృతం అయ్యాడు నారా లోకేష్. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడంలో ,తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందేందుకు వీలు కల్పించడంలో రఘురామ రాజు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దాదాపు 300–400 కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి సహాయ పడుతుందని అన్నారు.
The post లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీPM Narendra Modi: వందేమాతరం స్ఫూర్తినిచ్చే మహామంత్రం – ప్రధాని మోదీ

    వందేమాతరం గేయం… దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ..

CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్

    ‘కేంద్రానికి రూ.43 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అడ్డుకున్నారు. రీజినల్‌ రింగురోడ్డు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారు. వీళ్లిద్దరి సమన్వయం ప్రాజెక్టులను ఆపడానికా? తెలంగాణపై ఎందుకింత కక్ష?

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలిభార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ