hyderabadupdates.com Gallery పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి

పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి

పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేర‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక రైల్వే సమస్యలపై చర్చించారు. పిఠాపురంకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాముఖ్య‌త‌ను, పెరుగుతున్న ప్ర‌యాణీకుల ర‌ద్దీని ఉద‌హ‌రించారు. ఈ సంద‌ర్బంగా పిఠాపురం రైల్వే స్టేష‌న్ ను ఆద‌ర్శ‌వంత‌మైన కేంద్రంగా అభివృద్ది చేయాల‌ని ఉప ముఖ్య‌మంత్రి సూచించారు. బుధ‌వారం న్యూఢిల్లీలో ప‌ర్య‌టించారు. పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక రైల్వే సమస్యలపై చర్చించారు.
ప్రయాణికులకు, యాత్రికులకు ఆధునిక సౌకర్యాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలను అందించడానికి పిఠాపురం స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద చేర్చాలని ఆయన అభ్యర్థించారు. కుప్పం సమీపంలోని కంగుండిని రేపు ఏపీ మొదటి వారసత్వ గ్రామంగా ప్రకటించడం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర మంత్రిని సేతు బంధన్ పథకం కింద మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జిని పీఎం గతి శక్తి ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కూడా కోరారు. ఇది లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, జాతీయ రైల్వే ప్రణాళిక–2030కి అనుగుణంగా ఉంటుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. వాటిని వెంట‌న పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండ‌గా డిప్యూటీ సీఎం చేసిన సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి.
The post పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7

కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోందికాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోంది

హైద‌రాబాద్ : ఎన్టీవీలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఓ ఐఏఎస్ మహిళా ఆఫీస‌ర్ మ‌ధ్య ఏదో లింకు ఉందంటూ జుగుస్సాక‌ర‌మైన రీతిలో క‌థ‌నం ప్రసారం అయ్యింది. ఆ త‌ర్వాత ఎపిసోడ్స్ లెక్క‌న యూట్యూబ్ ఛానల్స్ రెచ్చి పోయి మ‌రిన్ని క‌థ‌నాలు స్టార్ట్

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటనMinister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

    దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి