hyderabadupdates.com Gallery ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా post thumbnail image

న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో జరిగిన ఓఎన్‌జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో గ్యాస్ లీక్‌తో పాటు చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం గురించి నిల‌దీశారు. ఈ ఘటనకు ముందు అక్కడ తప్పనిసరిగా అమలు చేయాల్సిన భద్రతా తనిఖీలు, పరికరాల సర్టిఫికేషన్, ఒత్తిడి పరీక్షలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయా అని ఎంపీ అడిగారు. అలాగే ఈ ప్రమాదానికి ఓఎన్‌జీసీ అధికారులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా అని పేర్కొన్నారు. ఎవరైనా బాధ్యులపై చర్యలు తీసుకున్నారా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వెల్లడించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
దీనిపై స‌మాధానం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. జ‌న‌వ‌రి 5న ఏపీలోని మోరి -5 చ‌మురు క్షేత్రంలో వ‌ర్క్ ఓవ‌ర్ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో గ్యాస్ లీక్ జ‌రిగింద‌ని ఒప్పుకున్నారు. ఈ క్షేత్రాన్ని 15 సంవత్సరాల ప్రొడక్షన్ ఎన్‌హాన్స్‌మెంట్ కాంట్రాక్ట్ కింద ఏప్రిల్ 3, 2025 నుంచి ఎం/ఎస్ డీప్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నదని స్ప‌ష్టం చేశారు.
ఘటన జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ తన సాంకేతిక నిపుణుల సహాయంతో ఐదు రోజులలోనే మంటలను అదుపులోకి తెచ్చి బావిని సురక్షితంగా మూసి వేసిందని సురేష్ గోపి చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదా ఎవరికీ గాయాలు ఏవీ జరగలేదని అన్నారు.. క్షేత్రాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించినప్పటి నుంచి డీజీఎంఎస్ వంటి చట్టబద్ధ సంస్థలు తరచూ భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
The post ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులుRamachandra Yadav: బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించిన మత్స్యకారులు

Ramachandra Yadav : నక్కపల్లి బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల వద్దకు వెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను (Ramachandra Yadav) పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయరదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. పోలీసుల

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య

దావోస్ వ‌ర‌ల్డ్ ఆర్థిక ఫోరంలో సీఎందావోస్ వ‌ర‌ల్డ్ ఆర్థిక ఫోరంలో సీఎం

హైద‌రాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలు దేరనుంది. సోమవారం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి పూజలు నిర్వహిస్తారు.