hyderabadupdates.com Gallery ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి

ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి

ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి post thumbnail image

గుంటూరు జిల్లా : ఎన్నారైలు స‌మాజ అభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాల‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటానని, కానీ ఈ రోజు నేను వచ్చిన ఈ కార్యక్రమం ఒక స్పూర్తిని ఇచ్చిందని చెప్పారు. ఇంకా సమాజంలో మంచి మిగిలి ఉంది అనడానికి మీరంతా ఉదాహరణ అని ప్ర‌శంసించారు. 40 ,50 ఏళ్ల క్రితమే మీరు విదేశాలకు వెళ్లారు. కొందరు జన్మభూమిని మర్చిపోతారు. కానీ చదువుకున్న కాలేజీని గుర్తు పెట్టుకుని 1981లోనే జింకానా ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద సాయం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు చంద్ర‌బాబు నాయుడు. మనమే కాదు…మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి అని అన్నారు. ఎందరో ముందుకు వచ్చి పాఠశాలలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు పెద్ద ఎత్తున ప్రజలే విరాళాలు ఇచ్చారని తెలిపారు.
మనదేశంలో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలు మరే దేశంలో లేవు అన్నారు. అమెరికాలో 18 ఏళ్లకే పిల్లలు బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తారని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. పిల్లలు ఎంత పెద్దవారైనా జీవితాంతం తల్లిదండ్రులు మెంటర్ చేయడం మనదన్నారు. నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారని, అంతేకాదు దాన్ని మెయింటైన్ చేయడం కోసం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయడం గొప్ప విషయం అన్నారు. ఏపీలో మెడిసిన్ చేసిన ఎంతోమంది అమెరికా వెళ్లారు. నేను 1995లో సీఎం అయినప్పుడు చాలామంది చదువుకుని అమెరికా వెళ్లిపోతున్నారు. బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందని కొందరు అడిగారు. రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని నేను అన్నాన‌ని గుర్తు చేశారు.
The post ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డిప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం యుద్దం జ‌రుగుతున్న క్ర‌మంలో ప్ర‌వాస భార‌తీయుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్ర‌ధాన‌మంత్రి

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దుఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు

ముంబై : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఇంత కాలం కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింద‌ని ఆరోపించారు. ముంబైలో మాజీ సీఎం మీడియాతో