hyderabadupdates.com Gallery జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత

జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత

జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత post thumbnail image

శ్రీసత్యసాయి జిల్లా : జగన్ హయాంలో అన్ని కల్తీలే జరిగాయని, చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. ఆయన్ను ప్రజలెప్పుడూ నమ్మరని, వైసీపీకి ఎప్పుడో పాడి కట్టేసి శవయాత్ర నిర్వహించారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉనికి కోసం జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధే సీఎం చంద్రబాబు విజన్ కు నిదర్శనమన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వడిగేపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు మంత్రి సవిత పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
119 ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మందికి రూ.2,717 కోట్ల మేర ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.63 లక్షల మందికి రూ.115 కోట్లు, పెనుకొండలో 40 వేల మందికి రూ.17 కోట్లు, గోరంట్ల మండలంలో 11 వేల మందికి రూ.4.29 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వడిగేపల్లి పంచాయతీలో 462 మందికి రూ.20 లక్షలు పింఛన్ల రూపంలో అందజేశామన్నారు. వడిగేపల్లి పంచాయతీలో ఇప్పటికే రూ.50 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, రూ.43 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టమన్నారు. రూ.21 లక్షలతో సిరి కల్చర్, గోకులం షెడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. దీపం–2 పథకం కింద 1,240 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 529 మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.27 లక్షలు జమ చేశామన్నారు. తల్లికి వందనం పథకం కింద పంచాయతీలోని 268 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.47 లక్షలు జమ చేశామని తెలిపారు. త్వరలో రూ.31 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు.
The post జగన్ హ‌యాంలో మొత్తం క‌ల్తీనే : ఎస్. స‌విత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీPM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ

Narendra Modi : దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. దేశంలో మావోయిస్టు ప్రభావితజిల్లాల సంఖ్య గత 11 ఏళ్లలో 125 నుంచి మూడుకు

Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !

Kashibugga : శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా… 16 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి

CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్

  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనదని.. పర్యావరణ సంపదతో పాటు, సాంస్కృతిక