hyderabadupdates.com Gallery టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న స్థానంలో తాత్కాలికంగా సీఎంఓలో విధులు నిర్వ‌హిస్తున్న ముద్దాడ ర‌విచంద్ర‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా తిరుమ‌ల‌లో ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంపై సుదీర్ఘంగా విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో సిట్ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకంగా నివేదిక అంద‌జేసింది. ఆనాడు జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఈవోగా ప‌ని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ పైనా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసింది.
దీని కార‌ణంగా త‌న‌పై బ‌దిలీ వేటు వేసిన‌ట్లు స‌మాచారం ప్ర‌ధానంగా క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఆనాడు టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కార‌ణ‌మ‌ని, త‌న హ‌యాంలోనే నెయ్యి సేక‌ర‌ణ విధానంలో తీసుకు వ‌చ్చిన మార్పులే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన‌ట్లు నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం. ఆనాడు టీటీడీకి ఈవోగా సింఘాల్ ఉన్నారు. త‌న ప్ర‌మేయం లేకుండా ఎలా జ‌రుగుతుంద‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించక పోవడం లేక గుర్తించినా చూసీ చూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్‌ ఆక్షేపించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈవోతో పాటు చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలాజీపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార‌సు చేసింది.
The post టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్Kinjarapu Atchennaidu: వైఎస్ జగన్‌ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్

    వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒక అబద్దాల కోరని విమర్శించారు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందన్నారు. గురువారం ఉమ్మడి

Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు

Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీElection Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ

Election Commission : తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్‌ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు