hyderabadupdates.com Gallery స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం post thumbnail image

విజ‌య‌వాడ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించి ఆనాడు అక్ర‌మంగా బ‌నాయించిన ఏపి స్కిల్ స్కాం కేసు పూర్తిగా వీగి పోయింద‌న్నారు. స్కిల్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో న్యాయం, ధర్మం గెలిచినట్ల‌యింద‌న్నారు వాసం శెట్టి సుభాష్. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందన్నారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడలేవని ఈ తీర్పుతో వెల్ల‌డైంద‌న్నారు. ఏపీ స్కిల్ కేసుతో చంద్రబాబుకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొనడం కీలక పరిణామం అన్నారు వాసం శెట్టి సుభాష్.
రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసులన్నీ ఒక్కొక్కటిగా కూలి పోతున్నాయన్నారు . ఇప్పటికే ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు పాత్ర లేదని తేల్చడమే దానికి నిదర్శనం అన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు ఉపసంహరించు కోవడంతో గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేయ‌డం చెంప పెట్టు లాగా మారింద‌న్నారు వాసంశెట్టి సుభాష్‌. చంద్రబాబు నాయుడి నిజాయితీ, విజనరీ పాలన, పరిపాలనా దక్షతపై మరోసారి రుజువైందన్నారు. ముఖ్య‌మంత్రి నాయకత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కార్మిక శాఖ మంత్రి. గతంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏపీ రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా నిర్వీర్యం చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని, అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు వాసం శెట్టి సుభాష్‌.
The post స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్‌ గోయల్‌Minister Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు – యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్‌ గోయల్‌

    అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ ఎవరి ఒత్తిడికీ

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీPM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

    ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ

Nalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టుNalgonda Police: అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం చేసిన నిందితుడి అరెస్టు

Nalgonda Police : అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడిన నిందితుడిని నల్గొండ (Nalgonda Police) జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు విలువైన కార్లు, ఆస్తి పత్రాలు, బాధితులకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు,