hyderabadupdates.com Gallery తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి  న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ post thumbnail image

తిరుప‌తి : తిరుప‌తి న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం స‌మీక్ష చేప‌ట్టారు. నగర కమిషనర్ మౌర్య‌ , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న సమావేసాశాన్ని ఉద్దేశించి మేయర్ మాట్లాడారు.2026 – 2027 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన చేసే సందర్భంగా మనం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రీ బ‌డ్జెట్ స‌మావేశానికి ప్రాధాన్య‌త ఉంద‌న్నారు డాక్ట‌ర్ శిరీష‌. గత బడ్జట్ అంచనాలు, అమలు తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు.
2025 … 26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమోదించిన బడ్జెట్ అంచనాలు తగ్గట్లు ఆదాయం వచ్చిందా లేదా అన్న‌ది కూడా ముఖ్య‌మ‌న్నారు. ముఖ్యంగా పన్నులు ప్రధాన ఆదాయం అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలపై భారం లేకుండా చూడాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో తిరుప‌తి న‌గ‌రంంలో పెద్ద ఎత్తున వ్య‌క్తిగ‌త‌, సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌లు ఉంటున్నాయ‌ని, వాటి పై ప‌న్నులు విధించ‌డం ద్వారా ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. వివిధ రకాల పన్నులు వసూలు కాకపోతే అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషించాల‌ని అన్నారు. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదించిన ప్రాధాన్యత క్రమంలో నిధుల ఖర్చు చేశామా లేదా అన్నది సవివవరంగా కౌన్సిల్ ముందు ఉంచాలని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్.
The post తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదారంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈద్-ఉల్-ఫితర్ సెలవు కారణంగా ప‌ద‌వ త‌ర‌గ‌తికి సంబంధించి జ‌ర‌గాల్సిన‌ ఆంగ్ల పరీక్షను వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ప‌రీక్ష వాస్తవానికి మార్చి 21న జరగాల్సి ఉంది. ఆంగ్ల పేపర్ (పేపర్

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్