దుబాయ్ : భారత దేశానికి చెందిన రూబుల్ నాగి సంచలనంగా మారారు. తను దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమమైన ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారతీయ విద్యావేత్త, కళాకారుడు, సామాజిక ఆవిష్కర్త గా గుర్తింపు పొందారు రూబుల్ నాగి. ఆమెకు 1 మిలియన్ డాలర్లు జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వేదికపై ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ సంవత్సరం 139 దేశాల నుండి 5,000 కి పైగా నామినేషన్లు, దరఖాస్తులు అందాయి విజేత గా నిలిచేందుకు. వీరిందరిని దాటుకుని ఇండియాకు చెందిన రూబుల్ నాగి విజేతగా ఎంపికయ్యారు. సమ్మిట్ చివరి రోజున ప్రకటన చేస్తూ, జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ, వర్కీ ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇరవై ఆరు సంవత్సరాల క్రితం, తన ఆర్ట్ వర్క్షాప్లలో ఒకదానిలో, భారతీయ టీచర్ రూబెల్ నాగి తన జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక పిల్లవాడిని కలిశాడు. అతను ఇంతకు ముందు ఎప్పుడూ పెన్సిల్ కూడా చూడలేదు అని ఆమె 2026 ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్లో గుర్తు చేసుకుంది.
సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య, సృజనాత్మకత, విశ్వాసాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. వేలాది మంది అభ్యర్థుల నుండి ఎంపిక చేయబడిన రూబెల్ నాగి, కళను ఒక సాధనంగా ఉపయోగించి పిల్లల జీవితాల్లో మార్పు తీసుకు రావాలనే తన దృఢ సంకల్పాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ అవార్డు ఆమె సేవలకు మాత్రమే కాకుండా, విద్య ద్వారా మనం సమాజాన్ని మార్చగలమనే ఆమె నమ్మకానికి కూడా ఒక గౌరవం లభించింది.
The post గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి
Categories: