hyderabadupdates.com Gallery మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు post thumbnail image

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాని మోదీకి, కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ నిధుల ద్వారా మ‌రింత అభివృద్ది చేసేందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మ‌చిలీప‌ట్నం పోర్టును జాతీయ ర‌హ‌దారి నెట్ వ‌ర్క్ తో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో భాగంగా ఆరు లేన్ల ర‌హ‌దారి నిర్మించ‌నున్నారు. ఇందుకు గాను ఈ నిధుల‌ను ఉప‌యోగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు సీఎం.
కొత్త కారిడార్ కు సంబంధించి లోత‌ట్టు ప్రాంతాల‌ను ఓడ రేవుతో అనుసంధానం చేయ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తిదారుల‌కు లాజిస్టిక్స్ ఖ‌ర్చుల‌ను భారీగా త‌గ్గిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదే క్ర‌మంలో మెరుగైన ర‌హ‌దారి వ‌ల్ల మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు వీలు ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ఆర్థిక వృద్దిని పెంచేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. దీని ద్వారా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు సీఎం. జాతీయ ర‌హ‌దారి 215 లోని మ‌చిలీప‌ట్నం బైపాస్ ద్వారా జాతీయ ర‌హ‌దారి 65 , ఎన్ హెచ్ 216 జంక్ష‌న్ ను మ‌చిలీప‌ట్నం పోర్టుకు అనుసంధానం చేస్తార‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని నిధుల‌ను మంజూరు చేస్తామ‌ని నితిన్ గ‌డ్క‌రీ హామీ ఇవ్వ‌డం ప‌ట్ల కృత‌జ్ఞత‌లు తెలిపారు.
The post మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శ‌ర్మ‌ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలిగిన పాల్కీ శ‌ర్మ‌

ముంబై : ఇండియాకు చెందిన అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన జ‌ర్న‌లిస్టు పాల్కీ శ‌ర్మ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు . తాను ఫ‌స్ట్ పోస్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా

DNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసిందిDNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసింది

    ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ

YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటనYS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈనెల 4 మంగళవారం నాడు మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన