hyderabadupdates.com Gallery కాసుల కోస‌మే ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో సిజేరియ‌న్లు

కాసుల కోస‌మే ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో సిజేరియ‌న్లు

కాసుల కోస‌మే ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో సిజేరియ‌న్లు post thumbnail image

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సిజేరియ‌న్ల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి లోక్ స‌భ సాక్షిగా. ప్రైవేట్ ఆస్ప‌త్రులు, కార్పొరేట్ హాస్పిట‌ల్స్ కేవ‌లం కాసుల‌ను కొల్ల‌గొట్ట‌డ‌మే ప్ర‌ధానంగా పెద్ద ఎత్తున సిజేరియ‌న్లు చేస్తున్నార‌ని వాపోయారు. ఈ సందర్భంగా మద్దిల గురుమూర్తి కేంద్ర స‌ర్కార్ దృష్టిని సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రసవం సహజ ప్రక్రియ అని, వైద్యం అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ జరగాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా జరుగుతున్న సిజేరియన్ డెలివరీల వల్ల ప్రజలపై ఆర్థిక భారం ప‌డుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎంపీ వాపోయారు.
ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం ద్వారా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తల్లి, శిశువుల ఆరోగ్యం దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, ఈ విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రజల అవగాహన, బాధ్యతాయుత వైద్య సేవలు అత్యంత అవసరమని గురుమూర్తి స్ప‌ష్టం చేశారు. తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమం, ప్రధాన్ మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, లక్ష్య, సుమన్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఈ సంద‌ర్బంగా ఎంపీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి . ఈ పథకాల ద్వారా ఉచిత ప్రసవ సేవలు, సిజేరియన్ సహా అన్ని వైద్య సేవలు, మందులు, రవాణా, నాణ్యమైన గౌరవ ప్రదమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
The post కాసుల కోస‌మే ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో సిజేరియ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌వితజ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌విత

అమరావతి : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అని, ఆయనకు విజన్ లేదు రాష్ట్రం గురించి ఆలోచన లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసి

CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్CM Revanth Reddy: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మంగళవారం ఘట్కేసర్ చేరుకున్న సీఎం… అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని ఓదార్చారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు.

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

    భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.