hyderabadupdates.com Gallery శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం post thumbnail image

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాల‌లు ధ‌రించిన భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. ఇదిలా ఉండ‌గా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం కోసం స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది శ్రీ‌శైలం ఆల‌యం. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు శ‌నివారం క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ మ‌ల్లికార్జున స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు.
The post శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎంరాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ : సీఎం

విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం విజ‌య‌న‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ అనేది ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లులోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

అమ‌రావ‌తి : నారా లోకేష్ యువ గ‌ళం చేప‌ట్టి స‌రిగ్గా మూడేళ్లు పూర్త‌య్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో

Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్

    విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నామని… ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే